
రాయవరం,అక్టోబర్ 08 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమరావతి నుంచి నేరుగా రాయవరం చేరుకున్న మంత్రిక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలుబాణాసంచాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఎస్ఐపిబి సమావేశానికి హాజరైన మంత్రి ఈ విచారకర సంఘటన విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి రాయవరం చేరుకున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తొలుత ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ తో చరవాణి ద్వారా మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ బాణాసంచా పేలుడు సంఘటనలో ఏరుగురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.

బాణాసంచా తయారీ కర్మాగారాలు కనీస ప్రమాణాలు పాటించాలన్నారు. భద్రత విషయంలో రాజీ పడకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి అధికారుల నిర్లక్ష్యం ఉంటే తగు తీసుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రినాయకులు సుభాష్ వెంట రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డి.ఎస్.పి రఘువీర్, అగ్నిమాపక సిబ్బంది, కూటమి పార్టీ ఉండవిల్లి శివ తదితరులు పాల్గొన్నారు.