
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 7:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 20 ఇసుక రీచ్ లలో రుతుప వనాలు సమీపిస్తున్నం దున ఈ నెల ఎనిమిదో తేదీ నుండి బహిరంగ ఇసుక రీచులలో ప్రత్యక్ష విక్రయాలు నిలుపుదల చేసి స్టాక్ యార్డుల ద్వారా విక్రయానికి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున భవన నిర్మాణ వినియోగదారులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఇకపై స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో రావులపాలెం గోపాల పురం జొన్నాడ తాతపూడి అమలాపురం ఊబలంక 1,2, వద్దిపర్రు 1,2 రీచులు పొడగట్లపల్లి 1,2, కపిలేశ్వరపురం ఆలమూరు పులిదిండి ఆత్రేయపురం అంకంపా లెం నార్కెడమిల్లి, తదితర రీచులలో ఈ నెల ఎనిమిదో తేదీ నుండి బహిరంగ ప్రత్యక్ష ఇసుక విక్రయాలు నిలుపుదల చేసి స్టాక్ యార్డుల ద్వారా తరలించేందుకు జిల్లా భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలోచర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.. ఈ 20 బహి రంగ రీచులకు వెళ్లే మార్గాలలో ట్రెంచులు త్రవ్వి నిషేధపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు
