

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 20:

కాగిత రమణ కుటుంబాన్నికి ప్రజా ఆయుధం మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరం గ్రామానికి చెందిన వెల్డర్ కాగిత రమణ సోదరుడు కాగిత రాజు హైదరాబాద్ ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతంలోని వర్క్ షాప్ నందు వెల్డర్ గా పనిచేస్తూ.. ప్రమాదవశాస్తు విద్యుత్ షాక్ తగిలి ఆదివారం రాత్రి మరణించాడు.
ఈ ప్రమాద దుర్ఘటనపై గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి మృతుడు రాజు స్వగృహం ఎ.వేమవరం గ్రామానికి మృతదేహం తీసుకువచ్చారు.వందలాది మంది గ్రామస్తులు మధ్యలో
అంత్యక్రియలు ముగించాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ ఆన్లైన్ రిపోర్టర్ మరియు V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్, సోదర వియోగం తో బాధపడుతూ..తమ్ముడు ఇక లేడు అనే వార్తను జీర్ణించుకోలేక దుఃఖ సాగరంలో మునిగి ఉన్న, అన్నా కాగిత రమణ ను ఆయన పరామర్శించి ఆధ్యాత్మిక మాటలు చెప్పి ధైర్యపరిచి ఓదార్చారు. అనంతరం ప్రమాద విషయాలను తెలుసుకుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెట్టా బుజ్జి, బుడితి రవి ,కుంచె సత్తిబాబు, నేరేడుమిల్లి చిన్నా, నేరేడుమిల్లి రామకృష్ణ, కుంచె బాబి , నేరేడుమిల్లి బాలాజీ, సిద్దుల ప్రసాద్ తదితరులు ఓదార్చిన వారిలో ఉన్నారు.