
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజమండ్రి సెప్టెంబర్ – 20:

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, భారత ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య ప్రయాణ దూరం మరింత సంక్షిప్తం అయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అల్లయన్స్ ఎయిర్ సంస్థ ఈ అక్టోబర్ 1 న తొలి విమానంతో ఈ మార్గంలో సేవలు ప్రారంభించనుందని తెలిపారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేశారు. ఏటీఆర్ 72 విమానం ఉదయం 09:25 గంటలకు తిరుపతి నుండి రాజమండ్రి చేరుకుని, తిరుగు ప్రయాణాన్ని ఉదయం 10:15 గంటలకు ప్రారంభిస్తుంది. అక్టోబర్ 2 నుండి ప్రతీ వారం మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో సేవలు ఉంటాయి. కొత్త సమయాల ప్రకారం ఉదయం 09:25కు తిరుపతి నుండి రాజమండ్రికి విమానం బయలు దేరి, ఉదయం 09:50కు తిరుగు ప్రయాణం సాగుతుంది. ఈ కొత్త ఎయిర్ కనెక్టివిటీ ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించడంతో పాటు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వెళ్లే అనేక మంది భక్తులకు ఉపయోగపడనుంది అని అధికారులు ఆలోచన. ఈ సర్వీసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్” ఆలోచనకు అనుగుణంగా ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఇంత మంచి సర్వీసు ప్రారంభించిన అల్లయన్స్ ఎయిర్కి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇంకోవైపు తాజా సర్వీసు ప్రారంభం పట్ల ఇటు రాజమండ్రి, అటు తిరుపతి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు, రామ్మోహన్ నాయుడు కృషికి ధన్యవాదాలు తెలిపారు.