
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 07:
సెప్టెంబర్ 8 వ తేదీ సోమవారం ‘ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్టు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మండల కేంద్రాలు,4 పురపాలక సంఘ కార్యాలయాలు, 3 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో అర్జీలు యధావిధిగా స్వీకరిస్తారని పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలోని గోదావరి భవన్ నందు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు వినతి పత్రాలను స్వీకరించను న్నట్టు వివరించారు. ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆయా స్థాయి లలో నిర్వ హించే వేదిక లను వద్దకు వెళ్లి అధికా రులు దృష్టికి సమస్యలను తెచ్చి తగు పరిష్కార మార్గాలు కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు..మీకోసం వెబ్సైట్లోనూ: ప్రజలు తమ సమస్యల అర్జీలను నేరుగా నమోదు చేసుకొన వచ్చు నన్నారు.మీకోసం వెబ్సైట్ Meekosam.ap. gov.in లోనూ దాఖలు (నమోదు) చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇందులో దాఖలైన అర్జీల స్థితి, సంబంధిత సమా చారాన్ని తెలుసుకునేం దుకు 1100 నంబరుకు ఫోన్ చేయవచ్చని ఆయన ఆయన ప్రకటనలో సూచించారు.