
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి జూలై 07:

మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి కనకదుర్గ భూపతిను వైఎస్ఆర్సిపి నాయకులు పరామర్శించారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి కనకదుర్గకు అనారోగ్యం కారణవల్ల శస్త్ర చికిత్సా జరిగింది. డాక్టర్లు సలహా మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను సోమవారం పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నూతన మండల వైసీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాస్, కుడిపూడి విద్యాసాగర్, నంబూరు శ్రీరామ్ చంద్ర మూర్తి, మాగం సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ, మాజీ టెంపుల్ చైర్మన్ గుత్తుల నాగబాబు, కర్రి బాలసుబ్రమణ్యం, వైస్ ప్రెసిడెంట్ పినిపే బుజ్జి, కమిటీ వెంకటేశ్వరరావు, మరియు గ్రామ శాఖ అధ్యక్షులు పితానిపండు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.