


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 24:

నిరుద్యోగులకు, ఉద్యోగా ర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నిర్వ హించే ఉద్యోగ నియామక ప్రక్రియ జాబ్ మేళా ను సద్వి నియోగం చేసుకోవాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళ వారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జాబ్ మేళా ప్రచార పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 28 వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా వికాస కేంద్రం, నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పి గన్నవరం మండల కేంద్రం గ్రేస్ డిగ్రీ కళాశాల నందు తాహసిల్దార్ కార్యాలయం పక్కన సుమారు 10 కంపెనీల మానవ వనరుల అభివృద్ధి అధికారుల భాగస్వామ్యంతో జాబ్ మేళా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించ డం జరుగుతుందన్నారు. కావున నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువత యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాదులను పెంపొందించుకోవా లన్నారు. 10 వ తరగతి నుండి పీజీ వరకు చదివిన వారికి వివిధ స్థాయిలలో ఉద్యో గాలు పొందే వెసులు బాటు ఉందన్నారు. విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలన అనంతరం ఎటువంటి పరీక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండానే కంపెనీల ప్రతి నిధులు అక్కడిక క్కడే అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూ చేసి, ఎంపికైన వారికి నియమాకపు ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోలేని వారికి, ఒకే చోట అనేక అవకాశాలను పొంద డానికి ఇదొక చక్కటి వేదిక న్నారు.అర్హులైన అభ్య ర్థులను గుర్తించి, వారికి ఉద్యోగాలు కల్పించడం,
నిరుద్యోగ యువతకు సరైన మార్గ నిర్దేశం చేస్తూ కంపె నీలకు అవసరమైన మానవ వనరులను అందించడం జాబ్ మేళా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వికాస జిల్లా మేనేజర్ జి రమేష్, నైపు ణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరిశేషు తదితరులు పాల్గొన్నారు