
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జూన్ 06:

జూన్ 12న పాఠశాలలు ప్రారంభానికి ముందుగా సంసిద్ధత చర్యలు – ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలు జూన్ 12న ప్రారంభమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆహ్లాదక వాతావరణం కల్పించేందుకు సంసిద్ధత చర్యలపై ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమీక్షా సమావేశం అమలాపురంలో నిర్వహించబడింది.

ఈ సమావేశం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్.కే. సలీం భాషా గారి అధ్యక్షతన, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీమతి జి. మమ్మీ గారి సారధ్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా వారు పాఠశాలలు తెరచే నాటికి తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలను స్పష్టం చేశారు:
📌 తరగతి గదులు, ల్యాబ్లు, పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలి.
📌 మరుగుదొడ్లను నిత్యం, అవసరమైతే రోజుకు రెండుసార్లు శుభ్రపరిచేలా చూడాలి.
📌 తుప్పలు, చెత్తాచెదారం, రద్దీ వస్తువులు, పాఠశాలకు సంబంధం లేని సామగ్రి తొలగించాలి.
📌 పాఠశాలలో విద్యార్థులకు త్రాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక సదుపాయాలు ముందుగానే పరిశీలించి, మరమ్మతులు అవసరమైతే వెంటనే నిర్వహించాలి.
📌 పాఠశాల గోడలు, బోర్డులు, బొమ్మలు, విద్యా ప్రదర్శనాల ద్వారా శిక్షణాత్మక వాతావరణం కల్పించాలి.
📌 విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని, శ్రమకి గౌరవం కలిగించేలా స్వాగత పటాలు, విద్యా ప్రేరణా సందేశాలు ఏర్పాటు చేయాలి.
📌 మొదటి రోజే తరగతులు ప్రారంభం అయ్యేలా పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి.
📌 ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, బాధ్యతలను బట్టి శాఖల వారీగా కేటాయించి సమన్వయంతో ముందడుగు వేయాలి.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీ బి. హనుమంతరావు, వివిధ మండల విద్యాశాఖాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
కార్యక్రమ ముగింపులో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీమతి జి. మమ్మీ గారిని, సమావేశంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.