
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడి…
మా వివరణ అనంతరం కొలంబియా ప్రభుత్వం సోషల్ మీడియాలో పాకిస్థాన్ లో మరణించిన వారికి సంతాపం తెలిపిన పోస్ట్ ఉపసంహరణ : ఎంపీ హరీష్ బాలయోగి
ఉగ్రవాదం పై పోరులో అమెరికా సంయుక్త రాష్ట్రాల మద్దతు భారతదేశానికి ఉందని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు.అఖిల పక్ష బృందం ఉగ్రవాదం పై పోరులో దేశ వాణిని వినిపించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ డేవిడ్ వాన్స్ తో భేటీలో ఈ విషయాన్ని ప్రకటించినట్లు చెప్పారు.ఆపరేషన్ సింధూర్ ను గూర్చి పూర్తిగా ప్రత్యక్షంగా వివరించడం జరిగిందన్నారు.ఎందుకు ఎదురు దాడి చేయాల్సి వచ్చిందో అక్కడి సెనేటర్స్ కు కూడా తెలిపినట్లు చెప్పారు.అమెరికా దేశ మద్దతు పూర్తిగా భారత దేశానికి ఉంటుందని డేవిడ్ వాన్స్ స్పష్టంగా తెలిపారని హరీష్ తెలిపారు.అలాగే కొలంబియా దేశం వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రతినిధులకు పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విధానాన్ని వివరించామని పహల్గాంలో 26 మందిని ఏ విధంగా పొట్టనపెట్టుకున్నారో వివరించామన్నారు.అనంతరం ఎదురు దాడి చేయాల్సిన పరిస్థితితులను తెలిపామన్నారు.కొలంబియా దేశ ప్రభుత్వం పాకిస్థాన్ లో మరణించిన వారికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన పోస్ట్ ను ఉపసంహరించుకుందని కొలంబియా దేశం మనకు మద్దతు అని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ అని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.