V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం, ఫిబ్రవరి 28, 2025

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ బి ఆర్ ఎ జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని ఈవీఎంల భద్రపరచిన గోదామును అధికారులతో కలిసి పరిశీలించారు. నెలవారి తనిఖీలో భాగంగా గోదాము సీళ్ళను తనిఖీ చేసి రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు.

భారత ఎన్నికల సంఘం మార్గ నిర్దేశాల మేరకు నెలకోసారి ఈవీఎం ల గోదామును తనిఖీ చేయడం జరుగుతుందని.. ప్రతి మూడు నెలలకోసారి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం ల గోదామును తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని డిఆర్ఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డి టి శివరాజ్ ముమ్మిడివరం డిప్యూటీ తాసిల్దార్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.