యువతను నమ్మించి వెన్నుపోటు పొడిచింది జగనే : నక్క సునీల్

విద్యార్థులను,యువతను నమ్మించి వెన్నుపోటు పొడిచింది జగనే : టీ.ఎన్. ఎస్. ఎఫ్.రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి.గన్నవరం జూన్ 04:

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులను,యువతను నమ్మించి వెన్నుపోటు పొడిచింది వైసీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి,పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డే అని టీ ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ ఆరోపించారు.అంబేద్కర్ విదేశీ విద్య పథకంతో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దోహదపడేలా నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తే ఆ పథకాన్ని రద్దు చేసిన జగన్ పేదలు ఉన్నత చదువులు లేకుండా చేసి విద్యార్థుల జీవితానికి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.పేద విద్యార్థులు డిగ్రీ అనంతరం చదివే పై చదువులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ఎత్తేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లేకుండా చేసిన జగన్ వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసింది జగన్ కాదా అని సునీల్ ప్రశ్నించారు.ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన జగన్ నేడు వెన్నుపోటు దినం అంటూ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.జగన్ పాలనలో అన్ని వర్గాల వారికీ వెన్నుపోటు పొడిచిన జగన్ మోహన్ రెడ్డి ప్రజల ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారని నక్కా సునీల్ విమర్శించారు.

Related Articles

కృష్ణా జిల్లా నాగాయలంక మత్స్యకారులు మృతి

బోటు నుంచి జారిపడిన మత్స్యకారులు.రెండుకు చేరిన మృతుల సంఖ్య V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అంతర్వేది జూన్ 16: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని సాగర సంగమం […]

అత్యంత వైభవంగా వినియోగదారుల దినోత్సవం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మలాపురం డిసెంబర్ 19: ఈనెల 24 తేదీ నిర్వహించబోయే జాతీయ వినియోగదారుల దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ […]

డాక్టర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం/కాట్రేనికోన, మే 27,2025 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి ఈ నెల మే 31 న రానున్న నేపథ్యంలో […]

ఎంపీటీసీ గుత్తుల మరణం బాధాకరం: వినయ్ కుమార్

పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వైసీపీ సీనియర్ నాయకులు గుత్తుల శ్రీరామమూర్తి ఆకస్మికంగా సోమవారం మృతి చెందారు. ఆయన ప్రస్తుతం క్రాప శంకరాయ గుడెం ఎంపీటీసీగా పనిచేస్తున్నారు.2006 సం” శ్రీరామమూర్తి ఆ గ్రామ పంచాయతీ […]