
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 05:

ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయిలో గురుపూజోత్సవ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యా యులు బాల బాలికల దిశా నిర్దేశకులు మార్గదర్శకులున్నారు.

తల్లి, తండ్రి, గురువు నిత్యం పూజ్యనీయు లన్నారు. గురి, లక్ష్యం, దిశ, మార్గం, చూపే వాడే గురువు అని అన్నారు. విద్యార్థు లు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించ వచ్చన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం నిర్వహించడం ఆనందదా యకంగా ఉందన్నారు. విశిష్ట సేవలతో విద్యారంగాన్ని అలంక రించిన దిగ్గజ ఉపాధ్యా యులకు ఘన సన్మానం చేయడం అభినం దనీయమన్నారు. 64 మంది సన్మాన గ్రహీత ఉపాధ్యా యులకు ఈ సన్మాన కార్య క్రమంలో శాలువాలు కప్పి, సన్మాన పత్రాలను పంపిణీ చేశారు.

డిఆర్ఓ కొత్త మాధవి ఉపాధ్యాయ వృత్తికే సర్వేపల్లి వన్నె తెచ్చార న్నారు. రాధాకృ ష్ణన్ ఉపాధ్యాయ వృత్తినీ పవిత్రమైనదిగా భావించి విద్యాబోధన చేసేవారన్నా రు. అందుకే ఉపాద్యాయ దినోత్సవాన్ని ఆయన పుట్టినరోజున చేసుకోవడం విశేషమన్నారు.సర్వేపల్లికి ఆంధ్రా, బెనారస్, ఢిల్లీ విశ్వ విద్యాలయాలకు వైఎస్ ఛాన్స్లర్గా గా చేసిన ఘసత సాంతమన్నారు. విద్యార్థు లకు ఆయన బోధన విలక్షణగాఉండేదన్నారు.

డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి మాట్లాడు తూ భారతదేశ మొట్ట మొదటి ఉప రాష్ట్ర పతి, రెండో రాష్ట్రపతిగా పని చేసిన సర్వేపల్లి రాధా కృష్ణన్ గొప్ప తత్వవేత్త 1962- 67వరకూ రాష్ట్ర పతిగా పని చేశారన్నారు భారతీయ తాత్విక చింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశపెట్టిన ఘ నత ఆయనదేనన్నారు. 1954లో భారతరత్న పురస్కారాన్ని పొందా రన్నారు రాధాకృష్ణన్ ఉపా ధ్యాయ వృత్తికి మించిన గొప్ప వృత్తి ఏదిలేదనీ ప్రపం చానికి చాటారన్నారు. డీఈవో షేక్ సలీం భాష మాట్లాడుతూ దేశ భవి ష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దు కుంటుందన్నారు మాజీ రాష్ట్రపతి సర్వే పల్లి రాధాకృష్ణన్. సమాజా నికి, విద్యార్థులకు మార్గ దర్శి ఉపాధ్యాయుడన్నారు.

తన జ్ఞానాన్ని విద్యార్థు లకు పంచుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దు తాడనీ. విలువలు, దేశ భక్తిని నేర్పుతాడనీ. ఆద ర్శంగా జీవిస్తాడన్నారు. అందుకే గురువు స్థానం వెలకట్టలేనిదన్నారు. ప్రపంచంలో అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవమున్నదన్నారు. ఎందుకంటే ఉపాధ్యా యులు సమాజాన్ని ప్రభా వితం చేస్తారన్నారు.

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న ట్టు విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా టీచర్ల వద్ద ఓనమాలు నేర్చుకున్న వారేనని అందుకే టీచర్లకు సముచిత గౌరవం దక్కు తుందన్నారు. ఏ పీ సి జి మమ్మీ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందనీ అజ్ఞానాన్ని పారదోలి జ్ఞాన మా ర్గంలో నడిపించడం గురువుకే సాధ్యమన్నారు.

ఈ కార్యక్రమంలో, జడ్పిటిసి పి హరి రామ్ గోపాల్ డిసిసిబి సభ్యులు బి హనుమంతరావు డిఎస్ఓ జివిఎస్ సుబ్రహ్మణ్యం సి ఎం ఓ సుబ్రహ్మణ్యం ఉప విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.