
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం ఆగస్టు 20:

భారీ వర్షాలు, గోదావరి వరదలు నేపథ్యంలో ఏటిగట్లు అక్విడెక్కులు పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాలని జలవనరుల ఇంజనీర్లను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పొలవరం మండల మురముళ్ళ పరిధిలోని అన్నంపల్లి అక్విడెక్ట్ వరద స్టోరేజ్ రూము సందర్శించి ఇసుక బస్తాలు ఇతర మెటీరియల్ నిల్వలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదలు భారీ వర్షాలు మూలంగా ప్రతి అధికారి అప్రమత్తతతో వ్యవహ రిస్తూ ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లకుండా ముం దస్తు జాగ్రత్త చర్యలను మెలకువలను పాటించా లని స్పష్టం చేశారు. అక్విడె క్టులు పటిష్టతపై చేపడుతు న్న రక్షణ చర్యలు ఆరా తీసి ఏమైనా సమస్యలు ఉన్నా యని అడిగి సంబంధిత ఇంజనీర్లను తెలుసుకున్నా రు. అదేవిధంగా స్థానికంగా పరిశీలనలో గమనించిన అంశాలపై పలు ఆదేశాలు జారీ చేసి వాటిని కూడా బలోపేతం చేయాలని సూచించారు ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి, నియోజ కవర్గ ప్రత్యేక అధికారి జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్ మధుసూదన్, జల వనరు ల శాఖ ఇంజనీర్లు వెంక టేశ్వరరావు మల్లికార్జున రావు తాసిల్దార్ సుభాష్, పాల్గొన్నారు