గెలుపు దిశగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల

ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు- ఏలూరు మార్చి 04 :

గెలుపు దిశగా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ముందు వరుసలో ఉన్నారు.

ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఐదో రౌండ్ నాటికి మొత్తం 1,40,000 ఓట్ల లెక్కింపు చేపట్టారు. అందులో చెల్లుబాటు అయినవి 1,27,907 కాగా, 12,093 చెల్లనివిగా ఉన్నాయి.

ఐదో రౌండ్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 15,632 ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు ఆయనకు మొత్తంగా 80,037 ఓట్లు వచ్చాయి. ఐదో రౌండ్లో పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకి 6,413 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనకు ఇప్పటివరకు వచ్చిన మొత్తం ఓట్లు 29,665కు చేరాయి. ఐదో రౌండ్లో 25,671 ఓట్లు చెల్లుబాటు కాగా.. చెల్లనివి 2,329గా అధికారులు గుర్తించారు. ఈ రౌండ్ ముగిసే సమయానికి కూటమి అభ్యర్థి రాజశేఖరం 50,372 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.మరి కొన్ని గంటల్లో ఫలితాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Related Articles

పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం.

గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం. పర్యావరణ పరి రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా […]

షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలలో ఇంటి మాదిరే: మంత్రి డోలా శ్రీ బాల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అల్లవరం జూన్ 16: షెడ్యూల్ కులాల విద్యార్థినీ విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాలలో ఇంటి మాదిరిగా చదువుకునే వాతావరణాన్ని కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేందుకు […]

కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం : జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, మార్చ్ 01: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ పనులు […]

జీవో నెంబర్ 123″ రొయ్యల పరిశ్రమల పర్యవేక్షణ తనిఖీ కమిటీ సభ్యులకు ఆదేశాలు జారీ

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 02: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రొయ్యల ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు తప్ప నిసరి అన్ని రకాల అనుమతులు పొందడంతో […]