
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ప్రజాముమ్మిడివరం ఆగస్టు 14:

భారీ వర్షాల నేపథ్యంలో పల్లపు ప్రాంతాలలో ఉన్న కార్యాలయాల రికార్డుల భద్రతపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇన్చార్జి డిఆర్ఓ కొత్త మాధవితో కలిసి ముమ్మిడివరంలోని బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పలు కార్యాలయాలు ముంపు బారిన పడిన దృష్ట్యా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, తాసిల్దార్ కార్యాలయం, ఉప ఖజానా అధికారి వారి కార్యాలయాలను సందర్శించి భద్రపరిచిన రికార్డు లు రికార్డు రూములను కంప్యూటర్లు భద్రతను పరిశీలించారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ బుధవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షా లు నమోదైన నేపథ్యం లో స్థానికంగా పల్లపు ప్రాంతా లలో ఉన్న ఈ మూడు కార్యాలయాలు రికార్డులు ఏ విధంగా ఉన్నది పరిశీలిం చడం జరిగిందన్నారు. అన్ని రికార్డులు భద్రంగా ఉన్నాయని ముంపు దృష్ట్యా రికార్డు రూములు కూడా భద్రతపై మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మూడు కార్యాలయాలలో రికార్డుల భద్రతకు శాశ్వత ప్రాతిప దికన చర్యలు తీసుకునేం దుకు అవసరమైన నివేదిక లను రూపొందించాలని ఇన్చార్జి డిఆర్ఓ కే మాధ విని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి టి ఆచార్య తాసిల్దార్ సుభాష్ రెవెన్యూ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.