

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజోలు,పి. గన్నవరం జూలై 17 :
విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి
మంత్రి లోకేశ్ చేతిలో విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉంది
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
కోనసీమ జిల్లా శివకోడూరు, నరేంద్రపురం గురుకులాల్లో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ

కిచెన్, స్టోర్ రూమ్,డార్మిటరి, మరుగుదొడ్లు పరిశీలన
విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్న మంత్రి
డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ / రాజోలు,పి. గన్నవరం జూలై 17 :

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం,విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి స్వామి పర్యటించారు.

రాజోలు నియోజకవర్గం శివకోడూరు, పి. గన్నవరం నియోజకవర్గం నరేంద్రపురం బాలికలు, బాలురు గురుకులాల్లో మంత్రి డా. స్వామి ఎంపీ గంటి హరీష్ మాధుర్, టీడీపీ నేత నామన రాంబాబు తో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కిచెన్, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి పాఠశాలలో అందుకున్న సౌకర్యాలు,సమస్యలు, టీచర్ల బోధనా తీరు విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం,విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి.విద్యార్థుల పట్ల మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గురుకులాలు ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు 10కి పెంచాం, ఐఐటీ నీట్ లో త్రుటిలో అర్హత కోల్పోయిన విద్యార్థులకు ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నాం.

గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మోటిక్ కిట్స్ అందజేస్తాం. ఏదైనా అనారోగ్యంతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉండేందుకు సాంత్వన పథకం ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లోకేశ్ చేతిలో రాష్ట్ర విద్యార్థుల భవిషత్తు సురక్షితంగా ఉందని మంత్రి స్వామి అన్నారు.