

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 14:

అర్జీదారుల సమస్యల పట్ల స్పందించే తీరు క్రియా త్మకంగా ఉంటూ అర్జీదారరు ని సంతృప్తి ధ్యేయంగా పరిష్కార మార్గాలు చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ( పి జి ఆర్ ఎస్ ) లో అర్జీదారుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి రాజ కుమారి తో పాటు ఇతర అధికారులు వినతులు స్వీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ సమస్యలను ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో విచారిస్తూ సంతృప్తి చెందే విధంగా పరిష్కార మార్గా లుఉండాలని సూచించారు ఆశా వర్కులకు సంబంధిం చిన పోస్టులకు పిజిఆర్ఎస్ నందు స్వీకరించబడవని ఆయా దరఖాస్తులను జిల్లా డిఎంహెచ్వో కార్యాల యంలో వారి నైపుణ్య అర్హతలను పరిశీలించి ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలియజేశారు అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి తమ యొక్క పూర్తి బయోడేటాను డిఎంహెచ్వో కార్యాలయంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంద న్నారు.

పీజీఆర్ఎస్ లో భాగంగా మొత్తంగా 265 వినతులు స్వీకరించడం జరిగిందన్నారు ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు తల్లికి వందనం, గ్రామీణా భివృద్ధి పంచాయ తీరాజ్ శాఖ కు చెందినవి ఎక్కువ గా ఉన్నాయన్నారు. వివిధ పథకాలు లబ్ధిని పొందేం దుకు అవసరమైన ఆన్లైన్ లేదా కేవైసీ సమస్యలపై దృష్టి సారించి పథకాల లబ్దిని సకాలంలో పొందే దిశగా అధికారులు చొరవ చోపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్వామా పిడి ఎస్ మధుసూదన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి కృష్ణమూర్తి, డి ఎల్ డి వో వేణుగోపాలరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించా రు..