
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 14:
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షలు వచ్చేవరకు అసత్య ప్రచారాలు చేయొద్దని ఎస్సై శాస్త్రి హెచ్చరించారు. అయినవిల్లి మండలం విలస డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో నా కుమారుడు మరణం వెనక నా కోడలు హస్తం ఉందని తల్లి దేవాబత్తుల మహాలక్ష్మీ అభియోగం అనే ఫిర్యాదులో నిజా నిజాలు నిగ్గు తేలేవరకు సోషల్ మీడియాలో అసత్య ప్రసారం చేయవద్దని అయినవిల్లి ఎస్ఐ శాస్త్రి హెచ్చరించారు.
దేవబత్తుల బాలయోగి 43 సం” ఇటివలే మరణించారు. అయితే ఈ మరణం సహజ మరణం కాదని, నా కోడలు నా కుమారుని హతమార్చి ఉండవచ్చును.అని అత్త కోడల పై అయినవిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు పై అయినవిల్లి పోలీసులు శవపరీక్ష అనంతరం, శవ మూలాలును ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షకు పంపించారు. రిపోర్టు వచ్చేవరకు సోషల్ మీడియాలో ఎలాంటి అసత్య ప్రసారాలు చెయ్యవద్దు అని ఎస్సై శాస్త్రి హెచ్చరిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.