కోనసీమ రైల్వే లైనుకు మార్గం సుగమం/ఎంపీ హరీష్ హర్షం

భూసేకరణ ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను తొలగించిన హైకోర్టు…

హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఎంపీ హరీష్ బాలయోగి…

కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను మార్గం పూర్తిచేయడానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగతుండటంతో కోనసీమ రైల్వే లైన్ మార్గం సుగమం కానుంది.భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన కేసులలో హైకోర్టు నేడు ఉత్తర్వులను వెలువరించింది.భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన కేసులపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వం తరుపున సమర్పించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం భూసేకరణ ప్రక్రియపై ఉన్న స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది.

హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఎంపీ హరీష్ బాలయోగి…

కోనసీమ రైల్వే ప్రాజెక్టు భూసేకరణ పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పేర్కొన్నారు. ఈ తీర్పుతో రైల్వే పనుల ప్రక్రియ తిరిగి త్వరిగతిన చేపట్టేలా కృషి చేస్తామన్నారు.రైతులు నష్ట పోకుండా వారికి న్యాయం చేసేలా కృషి చేస్తానన్నారు. హైకోర్టు తీర్పుతో కోనసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ఎన్నో ఏళ్లుగా కోనసీమ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ హరీష్ బాలయోగి తెలిపారు.

Related Articles

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ఆంధ్రప్రదేశ్ :బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు.నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం తో […]

2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి-కేఏ పాల్

2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.డీలిమిటేషన్‌ను అందరూ వ్యతిరేకించాలి అంటూ శనివారం కేఏ పాల్ పిలుపు ఇచ్చారు. ఉత్తరభారత్‌లో ఎంపీ స్థానాలు పెంచి,దక్షిణభారత్‌లో తగ్గిస్తున్నారు […]

ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్ 2025 – 1110 గ్రూప్ B & C పోస్టులు | INCET 01/2025 నోటిఫికేషన్ విడుదల.

ఇండియన్ నేవీ సివిలియన్ రిక్రూట్మెంట్ 2025 – 1110 గ్రూప్ B & C పోస్టులు | INCET 01/2025 నోటిఫికేషన్ విడుదల ఇండియన్ నేవీ ద్వారా సివిలియన్ ఉద్యోగాల భర్తీకి (Group B […]

ఎమ్మెల్యే గిడ్డి ఆదేశాలతో కన్నతల్లి వద్దకు చేరిన అదృశ్యమైన బాలిక.

ప్రజా ఆయుధం పి.గన్నవరం మార్చి 02:ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజా ఆయుధం మీడియాలో వచ్చిన అదృశ్యమైన బాలిక అనే కథనానికి పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వెంటనే స్పందించారు.పి […]