
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 15:

జూన్ 16వ తేది సోమవారం ఉదయం 10 గంటల నుండి స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడునని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చున న్నారు. ఏవైనా సందేహా లు ఉన్నట్లయితే అడగ వచ్చునన్నారు కొత్త ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు నన్నారు అర్జీదారుల వద్ద నుండి వినతులను స్వీకరించి వారి యొక్క సమస్యలను ప్రజా సమ స్యల పరిష్కార వేదిక యందు నమోదు చేస్తూ వారి సమస్యలకు పరిష్కారం తెలుపబడు నని, ప్రజా సౌకర్యార్దం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మూడు రెవెన్యూ డివిజన్లు 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయా లలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిం చబడు తుందని, కావున అర్జీదారులు ఆయా స్థాయి లలో తమ సమ స్యలను నమోదు చేసుకొని పరిష్కారం పొందు దిశగా ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.