V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం,మే 12,2025

ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి గ్రీవెన్స్ కార్యక్రమంలో అందే అర్జీలను నాణ్యతతో రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ఎన్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి, పిడి డ్వామా మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణమూర్తి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ ఇన్చార్జి నోడల్ ఆఫీసర్ ఎస్ టి వి రాజేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ విశ్వేశ్వరరావు అర్జీదారుల నుండి సుమారుగా 215 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులందరూ గ్రీవెన్స్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా వ్యక్తిగతంగా అర్జీలను ఓపెన్ చేసి చూడాలన్నారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అవగాహన చేసుకోవడం, క్షేత్రస్థాయిలో అర్జీదారుని వద్దకు వెళ్లి సమస్య గురించి మాట్లాడడం, సమస్యను పరిష్కరించలేని పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలాన్నారు.

రాష్ట్రస్థాయిలో ఆడిట్ టీములు అర్జీదారులకు ఫోన్ చేసి అర్జీల పరిష్కారం పై సంతృప్తి చెందారా లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారని.. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని డిఆర్ఓ ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయిలో కూడా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు జిల్లా కేంద్రానికి రావలసిన అవసరం లేకుండా ఆయా మండల , డివిజన్ కేంద్రాలలో అర్జీలను సమర్పించి పరిష్కార మార్గాలు పొందొచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసి డి మమ్మీ, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, డిసిహెచ్ఎస్ కార్తీక్, డిఎంహెచ్ఓ దుర్గారావు దొర , డిపిఓ శాంత లక్ష్మి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.ప్రసాద్, ఎస్ ఈ పిఆర్ రామకృష్ణారెడ్డి , జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.