V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు మండపేట ఏప్రిల్ 22;
మండపేట నియోజకవర్గం లో ఘనంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జన్మదిన వేడుకలు నిర్వహించారు.

వైసిపి బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పిఎసి) తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పీఏసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన ఈ మొదటి సమావేశంలో పార్టీ అధినేత జగన్ 33 మంది నాయకులను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు , తనను పీఏసీ సభ్యునిగా ఎన్నుకున్నందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ లక్ష్యాల సాధన రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విజయం సాధించేందుకు తన సంపూర్ణ మద్దతు కృషి ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జగన్ పార్టీ నాయకులకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలు, ప్రజల మధ్య పార్టీ సందేశాన్ని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు.