ఏప్రిల్ 20న మెగా ఉచిత వైద్య శిబిరం:రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యలుచే వైద్య పరీక్షలు నవ్యాంధ్ర ప్రదేశం మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు నాయుడు 75 వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ ఆరోగ్యం- మా బాధ్యత అనే నినాదంతో “సత్యం వాసంశెట్టి ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ 20 న ఉదయం 9 గంటలకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రామచంద్రపురం వి ఎస్ ఎమ్ ఇంనీరింగ్ కళాశాల ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో, మెడీ కవర్, మెడ్ వే సంజీవని, అగర్వాల్ కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల నుంచి వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు, ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులతో పాటు, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు, స్త్రీల( గైనిక్ ) సమస్యలకు నిపుణులచే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అన్నారు. ఈ వైద్య శిబిరంలో ఈసీజీ, టు డి ఎకో, బిపి, షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. ఏప్రిల్ 20 న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి సుభాష్ ఈ సందర్భంగా తెలిపారు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, ఏప్రిల్ 17:

Related Articles

పదోతరగతి 32,438 ఉద్యోగాలు.. గడువు పెంపు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తు గడుపు మరో వారం రోజులు పొడిగింది. మార్చి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.పదోవతరగతి/ఐటీఐ పాసై.. 18-36 […]

రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక- అమలాపురం డిసెంబర్ 14:డాక్టర్ కారెం రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు ఢిల్లీ నుంచి అందుకున్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో అతి తక్కువ […]

అక్కడే మకాం వేసిన ఎమ్మెల్సీ ఆశావాహులు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి మార్చి 09: నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు […]