
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25:

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు భారత రాజ్యాంగంపై వ్యాసరచన, క్విజ్ పోటీ లను నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు ఈ సం దర్భంగా ఆయన క్విజ్ పేపర్లను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఈ రెండు పోటీలలో ప్రతిభ సృజ నాత్మకతను కనపరిచి ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. డీఈవో షేక్ సలీం భాష మాట్లా డుతూ వివిధ పాఠశాల లకు చెందిన 132 మంది క్విజ్ పోటీలకు 22 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలకు హాజరయ్యార న్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జివి ఎస్ సుబ్రహ్మణ్యం అసి స్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హను మంతరావు కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి బివివి సుబ్రహ్మణ్యం డిస్టిక్ అకాడమిక్ కోఆర్డినేటర్ పి.వి బ్రహ్మానందం క్విజ్ మాస్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
