కోడి పందేలకు కోర్టు హైకోర్టు ఉత్తర్వుల్లో ఏమని పేర్కొంది.
N Vinay Kumar |v9prajaayudam EDITOR
తెలుగు సంప్రదాయాలకు సంక్రాంతి పండగ ఎంతో సందడిగా ఉండే ఈ పండుగ. కొత్త అల్లుళ్లు, రకరకాలు పిండి వంటలు, గంగిరెద్దుల హాస్య విన్యాసాలు, ఇంటి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు ఇలా ఒక్కటేమి సంక్రాంతి పెద్ద పండుగ వచ్చిందంటే చాలు పల్లెటూరు ప్రాంతాలు గ్రామాలు సందడిగా మారిపోతాయి. అలాగే మరోపక్క పెద్ద ఎత్తున సాంప్రదాయం పేరుతో కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. కడకు కోర్టులు జోక్యంతో
ఎన్ని చర్యలు చేపట్టిన పండుగ మూడు రోజులు మాత్రం పందాలు జరిగి తీరుతాయని ప్రతి ఒక్కరూ భావిస్తారు. జరిగేది కూడా ఇదే
కోడి పందేలకు కోర్టు హైకోర్టు ఉత్తర్వుల్లో ఏమని పేర్కొంది.
సంక్రాంతి పండుగ వేళ.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగకుండా చూడాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో అధికారుల సైతం అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు, జంతు హింస జరగకుండా చూడాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్.చక్రవర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కలెక్టర్ జిల్లా వేట్రీ సెల్వి అధికారులు ఆదేశించారు. సంక్రాంతి సంబరాల పేరిట జంతుహింస జరుగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు మేరకు జిల్లాలో రెవిన్యూ, పోలీస్ యంత్రాంగం, స్వచ్ఛంధ సంస్ధల ప్రతినిధులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీలను నియమిస్తూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందేలు, జూదాలు జరుగకుండా చూసేందుకు గట్టిగా ఏర్పడి చేశారు. ఈ ఉత్తర్వులుకు అనుగుణంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్ని మండలాల్లో ఎమ్మార్వో అధ్యక్షతన సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు గట్టినిఘాతో తనిఖీలు ముమ్మరం చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు.
ఇది ఇలా ఉండగా ప్రజా శ్రేయస్సును కోరే మేధావులు సంక్రాంతి పండుగలో అసాంఘిక కార్యక్రమాలు మరియు కోడిపందాలను పూర్తిగా వ్యతిరేకించాలని రాబోయే తరాలకు ఇలాంటి తప్పుడు సంప్రదాయాలను అనుసరించకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని చర్చించుకోవడం V9 ప్రజాయుధం మీడియా గమనించి ఈ చిన్న ఆర్టికల్ తో మీ ముందుకు వచ్చింది.