

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి అక్టోబర్ 11:

శానపల్లిలంక ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కి విశేష స్పందన లభించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక గురువు కాలువ వంతెన వద్ద,రక్షణ సువార్త ప్రార్ధన మందిరం ఆవరణం పాస్టర్ స్టీఫెన్ ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి మరియు సిలోయం ప్రాథమిక కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో సుమారు 120 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 12 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేసి, ఈనెల 15 వ తేదీ న కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి నందు శస్త్రచికిత్సకు అన్ని రకాల సదుపాయాలు రోగులకు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ప్రభాకర్ , మోసే లు తెలిపారు. రోగులందరికీ రవాణా, మందులు, భోజన వసతి కనిపిస్తామని, శస్త్రచికిత్స అనంతరం ఫాలో అప్ ట్రీట్మెంట్ (చికిత్స తర్వాత సమస్యలు ఏవైనా ఉన్నాయా లేదా వ్యాధి తిరిగి వచ్చిందా అని పర్యవేక్షించడం) కూడా నిర్వహిస్తామని V9 ప్రజా ఆయుధం మీడియాకు తెలిపారు. గ్రామాలలో పేదలకు మేలు కలిగే ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినందుకు, పాస్టర్ జె స్టీఫెన్ ను, మరియు కంటి డాక్టర్స్ బృందాలను ప్రజా ఆయుధం మీడియా తో పాటు గ్రామ పెద్దలు, రక్షణ సువార్త ప్రార్ధన మందిరం సంఘము మరియు విద్యావంతులు వారిని అభినందించారు.