భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే దిశగా ఉచిత ఇసుక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-

అమలాపురం డిసెంబర్ 19:భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే దిశగా డిమాండ్ కు అనుగుణం గా ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్ట రేట్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సెమీ మెకనైజ్డ్ ఇసుకరీచుల టెండర్ కండిషన్స్ అంశం, కొత్తగా గుర్తించిన ఇసుకరీచులు అనుమతులు జారి గురించి, పట్టా భూము లలో ఇసుక త్రవ్వకాలు నిర్వహణపై చర్చ, చింత లూరు లంక రీచ్ నుంచి ఇసుక త్రవ్వకాలు నిర్వహణ , మల్లేశ్వరం ఇసుక రీచు నిర్వహణ, మండల ప్రాంతీయ, స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు బలోపే తం ఇసుక లభ్యత, సరఫ రా అంశాల పురోగతిపై సమీక్షించారు. జిల్లా వ్యా ప్తంగా ప్రస్తుతం ఎనిమిది రీచ్ లలో మనుషుల ద్వారా ఇసుక త్రవ్వకాలు నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. వీటి లో పులిదిండి, ఆత్రేయ పురం ఊబలంక, వద్దిప ర్రు-2, పొడగట్లపల్లి, అంకంపాలెం -2, నార్కెట్ మిల్లి కపిలేశ్వరపురం ఓపెన్ రీచులలో ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నా యన్నారు. టెండర్ల ద్వా రా ఇసుక త్రవ్వకాల కొరకు నియమించిన ఏజెన్సీలు వర్క్ ఆర్డర్ ఇచ్చిన మూడు రోజు లలో తప్పని సరిగా తవ్వకాలు ప్రారం భించేలా చర్యలు చేప ట్టాలని ఆయన అధికా రులను ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డ్ లకు ఇసుకను తరలించి అందుబాటులో ఉంచు తూ యధావిధిగా విక్రయాలు కొనసాగించాలన్నారు ఇసుక వంటి సహ జవనరుల వెలికితీత విని యోగంలో గనులు భూగర్భ శాఖ పాత్ర కీలకమ న్నారు. భవన నిర్మాణ రంగానికి ఊతo ఇచ్చే విధంగా ఉచిత ఇసుక పాలసీ నీ పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అనుమ తించిన ఇసుక రీచుల నుండి త్రవ్వకాలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ సర ఫరా కై చర్యలు గైకొనాల న్నారు. ఉచిత ఇసుకను తీసుకువెళ్లి ఎవరైనా విక్ర యించడం నిల్వ చేస్తు న్నట్లు గుర్తించిన యెడల చట్టపరమైన చర్యలను తీసుకోవాలన్నారు గ్రామ పరిధిలో వ్యక్తిగత అవసరాలకు సమూహ నిర్మాణ పనుల కోసం వినియోగ దారులు ఇసుకను ఎడ్ల బండి లేదా ట్రాక్టర్ ద్వారా మనుషుల ద్వారా తవ్వకాలు నిర్వహించి తరలించుకోవాలన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక త్రవ్వకాలు రవాణా నిల్వ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లయితే కేసులు బనాయించి చర్యలు చేపట్టాలన్నారు ఎన్ఫోర్స్మెంట్ లు మరింత బలోపేతం చేయాలని అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టి అక్రమ ఇసుక రవాణాను పూర్తి స్థాయిలో నిరోధించాలన్నారు. ఉచిత ఇసుక సరఫరాలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రవర్తిం చిన ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి ఏజెన్సీ రోజువారీగా కనీసం 500 మెట్రిక్ టన్నుల ఇసుక త్రవ్వకాలు నిర్వహించాలని అంతకన్నా తక్కువ స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తే ఏజెన్సీని రద్దు చేయడం జరుగుతుంది న్నారు.నూతనంగా వశిష్ట గౌతమి నదులలో ఏడు రీచ్ లను గుర్తించడం జరిగిందని, వాటిలో పేరవరం, వెలిచేరు, రాజ వరం, గోపాలపురం 1,2, మెర్లపాలెం, తాడిపూడి రీచులు ఉన్నాయన్నారు. పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలకు సంబంధించి సంబంధిత పట్టాదారుని ద్వారా దరఖాస్తులు స్వీక రించి సర్వే, తదితర అ నుమతుల కొరకు చర్య లు చేపట్టాలన్నారు. నూ తనంగా ప్రతిపాదించిన రీచులకు నదీ సంరక్షణ అధికారి అనుమతి డీజీపీఎస్ సర్వే, మైనింగ్ ప్లాను పర్యావరణ అను మతులు త్వరితగతిన వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నూతనంగా ప్రతిపాదిం చిన రీచులలో బల్క్ వినియోగదారుల కొరకు అన్ని విధాల ఆమోదయో గ్యమైన ఒక సెమీ మెకానై జెడ్ రీచ్ ను ఎంపిక చే యాలని ఆదేశించారు. రవాణా చార్జీలు ఎక్కువ గా వసూలు చేస్తున్నారనే అభియోగాలు ఇకపై ఉత్పన్నం కాకుండా కమిటీ నిర్దేశించిన ధరలు నిర్దిష్టంగా పాటించే విధంగా లారీలు ట్రాక్టర్ల యాజమాన్యాల తో సమావేశం నిర్వహించి నిర్దేశిత ధరలు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావు ను ఆదేశించారు. సమయపాలన రవాణాలో జాప్యాలు నిరోధానికై ప్రతి స్టాక్ యార్డ్ లో కనీసం రెండు జెసిబిలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గోదా వరి నదిలో వంతెనలు, ఇతర నిర్మాణాలు కట్టడాలు ఉన్నచోట్ల వాటికి 500 మీటర్ల పరిధిలో ఎటువంటి త్రవ్వకాలు నిర్వహించ రాదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, జిల్లా గనులు భూగర్భ శాఖ ఏడి ఎల్ వంశీధర్ రెడ్డి, ఆర్డీవోలు పి శ్రీకర్, డి అఖిల, అడ్మిన్ ఎస్పి ప్రసాద్, డిపిఓ శాంత లక్ష్మి ఆర్ అండ్ బి .ఎస్ ఇ. బి రాము, ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ ఇ. సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ సు విజయ్, రియాల్టీ ఇన్స్పె క్టర్ టి సుజాత తదిత రులు పాల్గొన్నారు

Related Articles

రాజ్యాంగం అంటే స్వేచ్ఛా భారతం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 26: స్వేచ్ఛా భారతంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని వ్వాలన్న సంకల్పంతో రాజ్యాంగ రచన జరి గిందని జిల్లా కలెక్టర్ […]

వచ్చేవారం భారీగా విద్యార్థి సెలవులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –విద్యార్థులకు హాలిడేస్ అనే పదమే ఎంతో సంతోషాన్నిస్తుంది. అలాంటి స్పెషల్ మూమెంట్ ఈ డిసెంబర్ నెలలో మరోసారి వచ్చింది. ఈ నెల చివరలో క్రిస్మస్ […]

బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, అక్టోబర్ 2: బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా డాక్టర్ బి ఆర్ […]

సోషల్ మీడియాపై కఠినమైన చర్యలు:డిఎస్పి మురళీమోహన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు రాజోలు ఫిబ్రవరి 20: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తప్పవని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట […]