ప్రజా సంక్షేమం స్వర్ణాంధ్ర సాధన దిశగా ప్రయాణం :రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖామంత్రి పయ్యావుల కేశవ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాయవరం జూలై 26:

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధన దిశగా ముందుకు సాగుతుందనీ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖామంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు శని వారం మండల పరిధిలోని చెల్లూరు గ్రామంలో సుమా రు రూ 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సచి వాలయం 3 భవనాన్ని స్థానిక శాసనసభ్యులు అంచ నాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం నరేగా నిధులైన 90 లక్షల తో నూతనంగా నిర్మించ నున్న పంచాయ తీరాజ్ డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం రూ 1.31 కోట్ల అంచనాలు వ్యయంతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫ లకాన్ని ఆవిష్కరించారు అదేవిధంగా రూ 86.40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఇంటింటికి మంచినీటి కొళాయి పథ కాన్ని ప్రారంభించారు. సుమారు రూ 69 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న మహిళాశక్తి భవనం శంకుస్థాపన భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి రాష్ట్ర ప్రజల ఆలోచ నలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభ్యుదయ పదంలో నడిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు తీసుకుని వచ్చేలా ఆర్థికంగా పూర్తి సహకారం అందిస్తోందన్నారు. పోలవరం అమరావతి ఇతరత్రా కార్యక్ర మాలకు నిధులను సమకూ రుస్తోందని తెలిపారు. అభివృద్ధి ప్రదాతగా ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికై రేయింబవళ్లు శ్రమి స్తూ స్వర్ణాంధ్ర సాధనకై కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-4 అధక లక్ష్యం/ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 15: పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే పి-4 అధక లక్ష్యమనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా కలెక్టర్ […]

క్యాన్సర్ బాధితునికి మంత్రి సుభాష్ రూ. 20 వేలు ఆర్థిక సహాయం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం,డిసెంబర్ 16: అనారోగ్యంతో బాధపడుతున్న, నిరుపేద కుటుంబానికి చెందిన రామచంద్రపురం తొరంవారి వీధికు చెందిన మచ్చా వీరభద్రరావుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి […]

నూతన మీడియా అసోసియేషన్ ఎన్నిక.కార్యదర్శిగా ప్రజా ఆయుధం ఇన్స్చార్జ్ గవర

డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు క్లాస్ 4 ఉద్యోగుల భవనంలో ముచ్చిమిల్లి దుర్గారావు అధ్యక్షతన నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా […]

కానిస్టేబుల్‌గా ఎంపికైన స‌ర్ధార్ బాబు డ్రైవ‌ర్ కుమార్తె

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 01: తాండ‌వ‌ప‌ల్లికి గ్రామంలో సివిల్ కానిస్టేబుల్ గా జ‌ల్లి నాగ‌మ‌ణి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్ష ఫ‌లితాల్లో అమ‌లాపురం రూర‌ల్ […]