
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 15:
జగనన్నను కలిశాక కొన్నంత బలం వచ్చిందని ఆకుమర్తి దుర్గారావు మాదిగ అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కే జగన్నాధపురం ఉపసర్పంచ్ ఆకుమర్తి దుర్గారావు మాదిగ తన రాజకీయ గురువు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తో కలిసి మాజీ ముఖ్యమంత్రి మరియు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ను మంగళవారం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నందు మర్యాదపూర్వకంగా కలిశారు. పి గన్నవరం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అన్నతో కలిసి కష్టపడి పని చేయాలని చిరునవ్వుతో మృదువుగా ఇంపైన మాటలు పలికారు. ఈ సందర్భంగా అకుమర్తి జగన్ తో మిమ్మల్ని కలవడం కొండంత బలం వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు.
జగన్ అన్నను కలవటానికి చక్కటి అవకాశం కల్పించిన మా రాజకీయ గురువు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు రుణపడి ఉంటానని అన్నారు.