
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జులై 3:

మస్కట్ లో చిక్కుకున్న అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన సవరపు రామలక్ష్మి స్వదేశానికి తీసుకురావాలన్న విన్నపంపై స్పందించిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, అయినవిల్లి మండలం విలస గ్రామానికిచెందిన సవరపు రామలక్ష్మి మస్కట్లో చిక్కు కుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు తనను రక్షించి స్వదేశానికి తీసుకు రావాలంటూ విలపిస్తూ ఓ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ ఈ ఏడాది మార్చి నెలలో ఉపాధి నిమిత్తం రామలక్ష్మిని మస్కట్ పంపాడు. అక్కడ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇంటి యజమానులు తిండి సక్రమంగా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వాపోయింది. మస్కట్లో రామలక్ష్మి అక్కడి భారత రాయబార కార్యాలయo వద్దకు వెళ్లినాఎవరూస్పందిం చలేదని, అధికారులు ప్రజాప్ర తినిధులు తనను రక్షించి స్వదేశానికి తీసురావాలని వేడుకుంది. దీనిపై పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు ఆమె కుమారుడు సతీష్ తెలిపాడు.

ఈ అంశంపై కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు తక్షణమే స్పందించి భారత రాయబారం కార్యాలయం నుండి రెండు రోజులలో ఇండి యాకు తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి మరియు డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి వెల్లడించారు