

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 20:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు మేరకు శుక్రవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం అయినవిల్లి ముక్తేశ్వరం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం లో నూతన గా విధులను నిర్వహిస్తున్న తహసిల్దార్ సిహెచ్ విద్యాపతి అధ్యక్షతన శుక్రవారం రెవెన్యూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశంలో తాసిల్దార్ మాట్లాడుతూ.. రాజరికం నుండి రెవెన్యూ వ్యవస్థ ఉన్నదని భూ సంబంధిత సమస్యలు గత క్రీస్తుశకం 1786 వ సంవత్సరం నుంచి ఉన్నట్టుగా చరిత్ర చెబుతుందని క్రీస్తు శకం 1680సం” లో అప్పటి తానీషా ప్రభువుల ఆస్థానంలో అప్పటి ఖమ్మం జిల్లా పాల్వంచ తాసిల్దార్ గోపన్న ను భూమశిస్తూ వసూలు దుర్వినియోగం విషయంలో వారిని ఇబ్బందులు పెట్టిన చరిత్ర కూడా మనం రామదాసు గా మనం చూసాం అని అప్పటినుండి కూడా భూమిశిస్తు వసూలు తాసిల్దారు ద్వారా చేసేవారిని క్రీస్తుశకం 1540 సంవత్సరంలో షేర్షా ఆస్థానంలో భూ పరిపాలన వ్యవస్థను తీసుకువచ్చినట్టుగా చరిత్రను బట్టి తెలుస్తుందని అప్పటినుండి ఇప్పటివరకు ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు భూసంబంధ విషయాల్లో చాలా పారదర్శకంగా చేస్తుందని మనిషి పుట్టిన నాటి నుండి మరణించే వరకు వారికి గల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ని సేవలు చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నామని చాలా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యాలయ సిబ్బంది డి శ్రీనివాస్ డిప్యూటీ తాసిల్దార్, జే స్వర్ణ రీసర్వే డిప్యూటీ తాసిల్దార్ ఎం ఎం. ఎస్.రాయుడు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్. కోల ఉమాదేవి మండల డిప్యూటీ సర్వే యర్, ఆర్ నాగూర్ మేరా సాహెబ్, సీనియర్ నాయకులు మరియు మండలంలోని గ్రామ రెవెన్యూ అధికారులు మండలంలోని గ్రామ సర్వేలు మరియు కూటమి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు మండల స్థాయి కూటమి సభ్యులు,ఎంపీపీ, జడ్పిటిసి అన్ని గ్రామాల సర్పంచులు మరియు ఎంపీటీసీలు రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.