ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇక తాజాగా రెండో రౌండ్, మూడో రెండ్లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేట్ అయ్యారు.తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులుకు 7,210 ఓట్లు, కూటమి, ఏపీటీఎఫ్ మద్దతు అభ్యర్థి రఘువర్మకు 6,845 ఓట్లు వచ్చాయి. అదే విధంగా యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరి 5,804 ఓట్లు సాధించారు. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు.
రెండు, మూడు రౌండ్లలో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్లో అభ్యర్థి శివప్రసాదరావు, మూడో రౌండ్లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేషన్ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం ఆరు రౌండ్లు ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలిస్తారు. నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి శ్రీనివాసులు 7,230, రఘువర్మ 6,859 ఓట్లు సాధించారు.