

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మార్చి 03: మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.బాలయోగి తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ సమీపంలో ఉన్న జిఎంసి బాలయోగి స్టేడియం ప్రాంగణం బాలయోగి స్మృతి వనం లో ఉన్న బాలయోగి నిలువెత్తు విగ్రహాం వద్ద వేలాదిమంది నాయకులు కార్యకర్తలు అభిమానులు మధ్య తనయుడు పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో పెట్టింది ఆయనే అన్నారు. విశ్వ వ్యాప్తంగా కోనసీమకు గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అలాంటి కారణజన్ముడి కడుపున పుట్టటం నా అదృష్టం అన్నారు. నాన్నగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపించిన ప్రేమ, సేవా దృక్పథం ,అంకితభావం, ఆప్యాయతలు కలిగి ఉండటం వలన మన అందరి హృదయములో చిరస్థాయిగా నిలిచిపోయారు అని అన్నారు .

భౌతికంగా మరణించారు గాని ఆత్మీయంగా మన మధ్యలోనే ఉన్నారని తనయుడు ఒక్క క్షణం హరీష్ కన్నీటి పర్వం అయ్యారు. అనంతరం అశ్రునయనాల తో ఆయన దివ్య స్మృతికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలయోగి అభిమానులు తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
