ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మార్చి 03:
56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ లో క్షయ వ్యాధి నివారణ కొరకు 12 మంది సభ్యుల తో ఏర్పాటుచేసిన ఉప సంఘంలో భారతదేశం నుంచి ముగ్గురు డాక్టర్లను ఎంపిక చేయడం జరిగిం దని వారి ముగ్గురిలో జిల్లా నుండి డాక్టర్ పి ఎస్ శర్మ సభ్యులుగా ఉండ డం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సోమ వారం ఈ మేరకు జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు క్షయ వ్యాధి అపోహ నిర్మూలన గురించి ముద్రించిన ముద్రికను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలన ఉప సంఘంలో మన రాష్ట్రా నికి చెందిన అమలాపు రం వాస్త వ్యులైన డాక్టర్ పి ఎస్ శర్మకు అవకాశం లభించడం హర్ష నీయమ న్నారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ డాక్టర్ శర్మకు అభినందనలు తెలుపు తూ క్షయ వ్యాధి నివారణ అందరి బాధ్యత అని ప్రతి పౌరుడు క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలని తెలిపారు ఈనెల 17వ తేదీన జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన క్షయ వ్యాధి నిర్మూలన గురించి అవ గాహన కార్యక్రమం ప్రజలతో ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ పి ఎస్ శర్మ తెలిపారు ప్రతి ఒక్కరూ యొక్క అవగాహన సదస్సుకు హాజరై క్షయ వ్యాధి పట్ల ప్రజలకు ఉన్న అపోహలను సందేహాల ను నివృత్తి చేసుకునేందుకు చక్కటి వేదికన్నారు.