
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి గన్నవరం ఫిబ్రవరి 06:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొబ్బరి లో కోకో అంతర్ పంటగా సాగు చేస్తూ కోనసీమ జిల్లాను కోకో హబ్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలె క్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు సూచించారు గురువారం పి.గన్నవరం మండల పరిధిలోని ముంగండ గ్రామంలో కండవల్లి నాగేశ్వరరావు కు చెందిన కొబ్బరి తోటలలో కోకో అరటి జామ మిరియాలు తదితర అంతర పంటల సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కో కో ఉత్పత్తులకు మార్కెటింగ్ డిమాండ్ తో పాటుగా మంచి గిట్టు బాటు ధరలు లభిస్తున్నాయని ఆ దిశగా రైతాంగం కోనసీమ ప్రాంతంలో అంతర పంటల సాగు ద్వారా కోకో ను అభివృద్ధి చేయాలని సూచించడం జరిగిందన్నారు దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో కోకో సాగు అంశాలపై విశ్లేషించి సాగు విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసే దిశగా అధ్యయనం చేయడానికి రావడం జరిగిందన్నారు.

కోకో కాయలను ఆయన పరిశీలించి ప్రాసెసింగ్ విధివిధానాలను చాక్లెట్ తయారీ అంశాలను అభ్యుదయ రైతులను అడిగి తెలుసుకున్నారు. కోకో సాగులో తెగుళ్లు వ్యాప్తి సస్యరక్షణ పద్ధతులు సేంద్రియ వ్యవసాయ విధానాలు వంటి అంశాలను కూడా రైతులను అడిగి తెలుసు కున్నారు. రాలిన చెట్ల ఆకులు దుక్కులో కలిసిపోయి భూమి సారవంతమవుతుందని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.

క్రిమి కీటకాలు తోటలలో ఆశించిన సందర్భంలో అందరూ రైతులు ఏకకాలంలో క్రిమిసంహారక మందు లను పిచికారి చేస్తేనే ఆ యొక్క తెగుళ్లు నివారిం చుకోవచ్చునని లేని పక్షంలో ఎవరో ఒకరు క్రిమి సంహారక మందులు పిచికారి చేసిన ప్రక్క తోటల నుండి మళ్లీ అదే తెగుళ్లు వ్యాప్తికి ఆస్కా రం ఉంటుందని అందు చేత రైతులు ఏకకాలం లోనే క్రిమిసం హారక మందులు పిచికారి చేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వారికి వివ రించారు. వర్షాలు పడితే తెగుళ్లు నివారించబడతాయని రైతులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ తాసిల్దార్ పి శ్రీ పల్లవి ఉద్యాన అధికారి దిలీప్, ఖండవిల్లి నాగేశ్వ రరావు రైతులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.