
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్ట్ 25:

అర్జీలు పునరావృతంకా కుండా నిర్దేశ సమయంలో నాణ్యతతో పరిష్కరిస్తూ ప్రజల నుండి స్వీకరించే ఆర్జీలు పునరావృతం కాకుండా చూడాలని, నిర్దేశ సమయంలో నాణ్యతతో పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టి. నిషాoతి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి సుమారుగా 190 అర్జీలను స్వీకరించారు.

ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో మంచి ఫలితాలు సాధించ డంతో పాటు ప్రజా సమస్య లకు సంబంధించిన ఆర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి గడువులోగా పరిష్కరించేం దుకు బృంద స్ఫూర్తితో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా నిబద్ధతతో అర్జీల పరిష్కా రానికి కృషిచేయాలని సూచించారు. అర్జీల విష యంలో ఎట్టి పరిస్థితుల్లో నూ ఏ రూపం లోనూ నిర్ల క్ష్యం, కనిపించ కూడదని స్పష్టం చేశారు.

రంలో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఫిర్యా దులు పరిష్కారానికి సంబం ధించి అధికారులు లాగిన్ లో పూర్తిస్థాయిలో పరిజ్ఞానాన్ని అవగాహన కలిగి ఉండా లని ఆదేశించారు. అర్జీదార్ల సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయి లోకి వెళ్ళి పరిశీలన చేయాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లా డుతూ మండల, డివిజన్ స్థాయిలో స్వీకరించ బడిన ఫిర్యాదుల పరిష్కారంలో సరైన జవాబుదారితనంతో ఉండాలన్నారు. పరిష్క రించిన అనంతరం సంబం ధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వచ్చివారు దృవీకరించబడిన అనంత రం ఫిర్యాదులను ముగిం చాలని సూచించారు.

అలా చేయడం వలన సంబంధిత శాఖల అధికారులకు మండల స్థాయిలో జరిగే ఫిర్యాదులపై పూర్తి అవ గాహన, వారు ఇచ్చిన ఎండార్స్మెంట్ పై క్వాలిటీ తెలుస్తుందన్నారు. అర్జీలు పరిష్కారంలో నాణ్యత కనబరచాలన్నారు. అర్జీలు రీఓపెన్ లేకుండా శ్రద్ధ వహిం చాలన్నారు. అర్జీల పరిష్కా రం లో ఎటువంటి అలస త్వం వహించిన సహించేది లేదని సంబంధిత శాఖల అధికా రులను ఆదేశించారు.

ప్రజా సమ స్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ తో పాటుగా డి ఆర్ ఓ కె మాధవి డ్వామా పిడి ఎస్ మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, డి ఎల్ డి వో లు రాజేశ్వరరావు త్రినాధరావు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.