
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19:

ఉప్పలగుప్తం మండల రైతులతో ఎంపీ హరీష్ బాలయోగి…

ఎన్నో ఏళ్లుగా రైతుల పంట పొలాల చొచ్చుకుపోతున్న ఉప్పునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉప్పలగుప్తం మండలం రైతులకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ విప్ మరియు అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలంలో మెయిన్ డ్రైన్ నుండి సముద్రంలో కలసే డ్రైన్ కాలువ పూడుకుపోవడం,కాలువ గట్లు బలహీన పడడంతో మండలంలోని అన్ని గ్రామాల పంట పొలాల్లోకి సముద్రపు నీరు చేసి పంట నష్టం జరగడమే కాకుండా కొబ్బరి చెట్లు సైతం దెబ్బతింటున్నాయని అమలాపురంలోని ఎంపీ నివాసం వద్ద హరీష్ ను కలసిన రైతులు పాపోయారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలని కోరడంతో త్వరలో సమస్య ప్రాంతాన్ని పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు శాశ్వత పరిష్కారం చేయడాని సమస్యను రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి ఎంపీ హరీష్ బాలయోగి రైతులకు తెలిపారు.