ఎస్సి రిజర్వేషన్లలో ఎస్.బి.డబ్ల్యు.ఎం. పద్ధతి పాటించాలి.


ఎస్సీ ఉప వర్గీకరణ ఛైర్మన్ మిశ్రాకు జోగేష్ వినతిపత్రం.

వెనుకబాటు తనం ఆధారితంగా ప్రాధాన్య మార్కులు ఇవ్వడం లేదా రోష్టర్ పద్దతి పాటించటం ద్వారా అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్ ఫలాలు మొదటిగా అందేలా చేయాలని ఎస్సీ ఉప కులాలు ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రం అందచేసినట్లు ప్రముఖ న్యాయవాది బడుగు భాస్కర్ జోగేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయనొక పత్రికా ప్రకటన విడుదల చేసారు. బిసిలలో ఎబిసిడి వర్గీకరణ విఫలమైన కారణంగానే అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం(ఎంబిసి)ఏర్పడిందని తెలిపారు.ఇప్పటికే విఫలమైన పద్ధతిని ఎస్సీ సామాజిక వర్గానికి వర్తింపజేయాలనే ప్రయత్నం సమస్యను పరిష్కరించదని అన్నారు. 59 ఉపకులాలను 4వర్గాలుగా విభజిస్తే అందరికీ సమన్యాయం అందదని వివరించారు. ఈ కార్యక్రమంలో వస్కాశ్యాంసుందర్,పిల్లి కన్నబాబు,బి.వెంకటేష్, బి.అగ్ని , పి.నాని,కుమ్మరి రమణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

సోమవారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన షెడ్యూల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అక్టోబర్ 06:

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధి గెలుపు కోరుతూ ఎంపీ ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 22:రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ […]

జిల్లా వైసిపి కార్యదర్శిగా టేకిముడి శ్రీనివాస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేటమండపేట జూలై 05: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వైసిపి కార్యదర్శి గాచెందిన టేకిముడి శ్రీనివాస్ని నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం […]

యధావిధిగా అమలాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక/1100 డయిల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 22: ఈనెల 23వ సోమవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ […]