


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 14:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.గన్నవరం నియోజకవర్గం,అంబాజీపేట మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ గా నియమితుడైన మోర్త సత్తిబాబును స్థానిక కూటమి నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ముక్తేశ్వరం కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆయనను దుస్సాలువాలతోను పూలమాలలతోనూ సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తీన్మార్ వాయిద్యాలతోనూ బాణసంచా పేళుళ్ళతోనూ ఆ ప్రాంతం మార్మోగింది.ఈ సందర్భంగా పలువురు నాయకులు సత్తిబాబును పూలమాలలతోనూ దుశ్శాలువాలతోనూ సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముందు వారు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుని అభినందనలు తెలియ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సరెళ్ళ సత్యనారాయణ బడుగు భాస్కర్ జోగేష్ ,గుమ్మల్ల సాగర్, కుసుమ బహుగుణ, సర్పంచ్ కాకర బాబ్జి , మోర్త వెంకటేశ్వరరావు, పెట్టా పండు, గిడ్ల వెంకటేశ్వరరావు, కుంచె చంద్రకాంతుడు, మద్దాల ఫణి కిరణ్ ,మట్టపర్తి అచ్యుతానంద్, గుత్తుల భాస్కరరావు, దంగేటి వెంకట రమణ, జనసేన నాయకులు మద్దా చంటిబాబు ,సలాది బుచ్చి రాజు ,మేడిది దుర్గాప్రసాద్, పడాల గిరి, చింతా వనుములురావు, పరమట నాని, జంగా ప్రసాద్, కె వివి సత్యనారాయణ, కుమ్మరి రమణ, నల్లా సూర్యనారాయణ, శీలం కిట్నయ్య,కడలి పెద్ద ,ఇళ్ళ సుబ్బారావు భీమవరపు చలం, నల్లా పల్లాలు ఎం.సుబ్బారావు, మోర్త భరత్, ఎం. విజయారావు, బుడితి శ్రీను, దంగేటి చిన్న, వేండ్ర లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.