V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆఖిల పక్ష విదేశీ బృందంలో సభ్యునిగా వెళ్లనున్న ఎంపీ హరీష్ ను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఎన్డీయే ప్రభుత్వంలో యువతను ప్రోత్సహించడంలో ముందుండే ప్రధాని మోదీ,ముఖ్యమంత్రి చంద్రబాబు…
నాడూ నేడూ బాలయోగి కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
కాశ్మీర్ పర్యాటక ప్రాంతం పహల్గాం లో ఇటీవల పాకిస్థాన్ ముష్కరులు జరిపిన దాడులను,పాకిస్థాన్ దురాగతాలను వివరించేందుకు అంతర్జాతీయ వేదికగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆఖిలపక్ష విదేశీ బృందాల సభ్యుడైన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. ఈ నెల 24 వ తేదీ నుండి జూన్ నెల 5 వ తారీఖు వరకూ ఈ పర్యటన జరగనున్నట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.ఎన్డీయే ప్రభుత్వ హయాంలో యువతను ప్రోత్సహించడంలో ప్రధాని నరేంద్ర మోదీ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయుడు ముందుంటారని తెలియజేయడానికి ఇదో నిదర్శనంగా చెప్పవచ్చు.నాడు రాజకీయ అరంగేట్రం చేసిన జీఎంసీ బాలయోగికి మొదటి నుంచి సముచిత స్థానం కల్పిస్తూ ఎలాంటి ప్రాధాన్యతను ఇచ్చారో నేడు హరీష్ బాలయోగికి ఆదినుండి అదే సుమచిత స్థానం కల్పించడం పట్ల ఆయన కుటుంబానికి చంద్రబాబునాయుడు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది.