ప్రతి ఎకరాకి సాగునీరు//కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
రామచంద్రపురం, మార్చి 24:

ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని సోమవారం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్, డ్రైన్స్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని.. సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క ఎకరం కూడా ఎండడానికి వీలు లేదన్నారు. గతంలో డ్రైనేజీలు, కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపు డెక్క,పూడిక తో నిండి అధ్వానంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైనేజీలు కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అధికారులు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. రైతు 10 వేళ్ళు మట్టిలో పెడితేనే మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయని గుర్తు చేశారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధికారులకి రైతులకి మధ్య వారధిలా పని చేయాలన్నారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు క్షేత్రస్థాయిలో ఎక్కడ నీరందడం లేదో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాగునీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల నుంచి గతంలో ఉన్న సమస్యలను అధిగమించి అందరూ కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఎక్కడో కొన్నిచోట్ల శివారు భూములకు నీరందకపోతే మండలమంతా సాగు నీరందడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారని అది తగదని హితవు పలికారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు మెరుగ్గా పనిచేస్తున్నాయని.. ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించే విధంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ ఈ రామకృష్ణ, డ్రైన్స్ డీ ఈ పోచరావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాజులూరు, రామచంద్రపురం, ఎర్ర పోతవరం, కోటిపల్లి అధ్యక్షులు ఎల్ కృష్ణ చైతన్య, ఎం సత్యనారాయణ రెడ్డి, ఎన్ సుబ్రహ్మణ్యేశ్వర రావు , విజయరామరాజు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

హైదరాబాద్‌లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం కలెక్టరేట్ సెప్టెంబర్ 04: కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కె సీఎం) ను మరింత బలోపేతం చేయడం, వలస కార్మికులకు సంబంధించిన సమస్యల […]

డీఆర్డిఓ (DRDO), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) విభాగాలలో ఉద్యోగాల భర్తీ.

DRDO Recruitment Notification: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డిఓ (DRDO), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) విభాగాలలో ఉద్యోగాల భర్తీ. 👉మొత్తం ఖాళీలు: 152 👉సైంటిస్ట్-బి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన […]

ప్రకృతి సేద్య విధానాలను అవలంబించి రైతుల ఖర్చు తగ్గించాలి: కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కొత్తపేట,ఆలమూరు సెప్టెంబరు 08 : వరి సాగులో ప్రకృతి సేద్య విధానాలను అవలంబించి రైతుల ఖర్చు తగ్గించడంతో పాటుగా లాభాన్ని పెంచే నానో యూరియా […]

అమలాపురంలో అశ్విని డెంటల్ కేర్ ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 23: అమలాపురంలో అశ్విని డెంటల్ కేర్ హాస్పిటల్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]