V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జనవరి 31:
అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ శుక్రవారం అల్లవరం తన పార్టీ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు అమలు కాలేదు అంటూ విమర్శిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజా జీవితాలతో ఆటలాడుతోందని, ఎన్నికల ముందు బాబు గారు ఊదరకొట్టిన సూపర్ సిక్స్ అమలు చేయలేనని చేతులెత్తేసిన పరిస్థితుల్లో ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ అన్నారు.
జగననన్న సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ, ఖచ్చితంగా చెప్పిన రోజున సంక్షేమ పథకాలను అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, బాబు గారు పేదలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ మోసం చేసి బాబు గారు సరికొత్త రికార్డు సృష్టించారని చింతా అనురాధ ఎద్దేవా చేసారు. ఇవే కాకుండా 16000 కోట్ల కరెంట్ చార్జీలు పెంచిన కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో ప్రతి చోటా ప్రజాగ్రహం వెళ్లువెత్తుతూ ఉండడంతో వారు రోజూ డైవర్షన్ పాలిటిక్స్ డ్రామా ఆడుతున్నట్లు చింతా అనురాధ ఆరోపించారు.
ప్రపంచంలోనే విజనరీ అని చెప్పుకునే బాబు గారు, దావోస్ లో పోద్దున్నే అందరికంటే ముందు సమావేశాలకు వెళ్ళినా, అక్కడి నుండి వట్టి చేతులతో తిరిగి రావడం కంటే చోద్యం ఏమన్నా ఉందా అని అనురాధ ప్రశ్నించారు.ముందు ముందు ఇంకెన్ని రకాలుగా బాబు గారు దగా చేస్తారో అని ప్రజలు భయపడుతున్నారని చెబుతూ, బాబు గారు ఇకనైనా కుంటి సాకులు మానేసి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేకపోతే ప్రజాగ్రహం తప్పదని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ హెచ్చరించారు.