
తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 26:
మొంథా” తుఫాను హెచ్చరికను పెడచెవిన పెట్టొద్దు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు నియోజకవర్గ ప్రజలను కోరారు.
భారత వాతావరణ అధికారులు వెల్లడించిన “మొంథా” తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురం నియోజకవర్గం
ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సూచించారు. ఈ మేరకు ఆయన అమలాపురం నియోజకవర్గంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం (తుఫాన్) కారణంగా రాబోయే 72 గంటలు (3 రోజులు) అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ, పశు ,పంట నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో మండల, గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా పనిచేసే ప్రదేశాల్లోనే ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను కోరారు. హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్ళ రాదని అన్నారు. కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్ళేవారు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిధ్ధంగా ఉంది అన్నారు.
